Vizag Student: చలిలో ఊపిరందక.. ఆస్ట్రేలియాలో విశాఖ విద్యార్థి మృతి

డిగ్రీ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లారా విశాఖ యువకుడు. ఉదయం వేళ పార్కులో నడుస్తుండగా తీవ్రమైన చలివల్ల ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరై కింద పడిపోయారు.

Updated : 30 Aug 2021 07:42 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: డిగ్రీ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లారా విశాఖ యువకుడు. ఉదయం వేళ పార్కులో నడుస్తుండగా తీవ్రమైన చలివల్ల ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరై కింద పడిపోయారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో అటువైపు ఎవరూ రాకపోయేసరికి మరణించారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం గుల్లలపాలెం వుడా కాలనీకి చెందిన ప్రసంగి శ్రీనివాసరావు, కవిత దంపతుల పెద్ద కుమారుడు చెన్నకేశవ సాయి (20) మెల్‌బోర్న్‌లో డిగ్రీ చదివేందుకు అక్కడికి వెళ్లారు. ప్రసుత్తం బీఎస్సీ రెండో ఏడాది చదువుతున్న చెన్నకేశవ సాయి ఈ నెల 16న అక్కడి పార్కులో ఉదయపు నడకకు వెళ్లారు. తీవ్రమైన చలివల్ల ఊపిరి అందక అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. 3 రోజులదాకా ఈ విషయం ఎవరికీ తెలియలేదు. బంధువులు, స్నేహితులు గాలింపు చేపట్టడంతో విషయం బయటపడింది. వెంటనే వారు చెన్నకేశవ సాయిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆదివారం విశాఖలోని స్వగృహానికి తీసుకొచ్చిన మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని