Crime news: కాపలాదారే కాజేశాడు.. చింతల్‌బస్తీలో భారీ చోరీ

సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న చింతలబస్తీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్‌ దంపతులే ఈ దోపిడీకి పాల్పడ్డారు. యజమాని...

Published : 17 Oct 2021 02:02 IST

హైదరాబాద్‌: సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న చింతలబస్తీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్‌ దంపతులే ఈ దోపిడీకి పాల్పడ్డారు. యజమాని ఇంట్లో లేని సమయంలో రూ.30 లక్షల విలువైన బంగారం కాజేశారు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నేపాల్‌ దంపతులు.. వయసులో పెద్దవాళ్లైన ఇంటి యజమాని తల్లిదండ్రులను తాళ్లతో కట్టేసి ఇంట్లోని బంగారం ఎత్తుకెళ్లారు. యజ్ఞ అగర్వాల్‌ టెక్స్‌టైల్స్‌ యజమాని అగర్వాల్‌ ఇంట్లో ఈ దొంగతనం జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని