Crime: డబ్బు మీద ఆశతో.. భర్తను కడతేర్చిన భార్య

 ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న కుటుంబంలో ధనాశ చిచ్చుపెట్టింది. రూ.45 లక్షల కోసం తన మరిదితో కలిసి.. భర్తనే హతమార్చింది ఓ భార్య. ఉత్తర్‌ప్రదేశ్‌ గ్రేటర్‌ నోయిడాలోని గర్హీ షాహ్‌దరాలో నివాసం ఉండే అజిత్‌, కవిత దంపతులకు ఇద్దరు పిల్లలు.

Published : 27 Jul 2021 06:56 IST

ఉత్తర్‌ప్రదేశ్‌: ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న కుటుంబంలో ధనాశ చిచ్చుపెట్టింది. రూ.45 లక్షల కోసం తన మరిదితో కలిసి.. భర్తనే హతమార్చింది ఓ భార్య. ఉత్తర్‌ప్రదేశ్‌ గ్రేటర్‌ నోయిడాలోని గర్హీ షాహ్‌దరాలో నివాసం ఉండే అజిత్‌, కవిత దంపతులకు ఇద్దరు పిల్లలు. అజిత్‌.. ఇటీవల ఓ ఫ్లాట్‌ అమ్మగా రూ.45లక్షలు వచ్చాయి. ఈ డబ్బును బ్యాంకులో వేశాడు. దీన్ని ఎలాగైనా రాబట్టాలని కవిత.. తన మరిదితో కలిసి పథకం పన్నింది. అనుకున్నట్లుగానే.. అజిత్‌ను హతమార్చి బులంద్‌షహర్‌ కల్పా గ్రామం వద్ద ఉన్న నదిలో పడేసింది. అజిత్‌.. కనబడకపోవడంతో అతని మేనల్లుడు సూరజ్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముందు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. తర్వాత అనుమానం వచ్చి అజిత్‌ భార్యను తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కవితతో పాటు.. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని