Crime news: కుటుంబ కలహాలతో భర్తను నరికిన భార్య

కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది అతని భార్య. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపతిపురంలో

Updated : 06 Sep 2021 07:24 IST

తూగో జిల్లా లక్ష్మీపతిపురంలో కలకలం సృష్టించిన దారుణ హత్య

తాళ్లరేవు, న్యూస్‌టుడే: కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది అతని భార్య. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపతిపురంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి అప్పారావు(32)కు, ఐ.పోలవరం మండలం కొమరగిరికి చెందిన దేవితో 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి అయిదో తరగతి చదివే కుమార్తె, మూడో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వీరు ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉండేవారు. ఇటీవల కోరంగి పోలీసుస్టేషన్‌లో గ్రామపెద్దలు, పోలీసుల సమక్షంలో ఇద్దరికీ రాజీ కుదిర్చారు. ఈ గొడవ విషయం అప్పారావు పనిచేస్తున్న కంపెనీలో తెలిసి పనిలోంచి తొలగించారు. అప్పటి నుంచి అప్పారావు ఇంటి వద్దే ఉంటున్నాడు. గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున అప్పారావును గొడ్డలితో నరికి హత్య చేసింది. భార్యే అతన్ని హత్య చేసినట్లు ఆధారాలున్నాయని కాకినాడ డీఎస్పీ భీమారావు, కాకినాడ గ్రామీణ సీఐ మురళీకృష్ణ వెల్లడించారు. నిందితురాలు పరారీలో ఉందన్నారు. హత్య కేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని