Crime News: క్షణికావేశంలో రోకలిబండతో భర్తపై దాడి..
కుటుంబ కలహాలతో భర్తను భార్య హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండలో చోటు చేసుకుంది.
తాడికొండ: కుటుంబ కలహాలతో భర్తను భార్య హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండలో చోటు చేసుకుంది. ఈ నెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రమేష్(40), నిర్మలకు 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఐదు సంవత్సరాల నుంచి రమేష్ పక్షవాతంతో బాధపడేవారు. కొంతకాలంగా దంపతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలో వీరు ఈ నెల 20న మరోసారి గొడవపడ్డారు. క్షణికావేశంలో భార్య నిర్మల.. భర్తపై రోకలిబండతో దాడి చేసింది. రమేష్కు తీవ్రగాయాలు కావడంతో అతడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు నిర్మలను పోలీసులు అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!