Nagpur: ప్రియుడి కోసం గ్యాంగ్రేప్ నాటకం.. పోలీసులకు చెమటలు పట్టించిన యువతి
బాయ్ఫ్రెండ్ను దక్కించుకునేందుకు ఓ యువతి గ్యాంగ్రేప్ నాటకమాడింది. తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులను ఆశ్రయించింది......
నాగ్పుర్: ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు దర్యాప్తు కోసం వెయ్యి మంది పోలీసులను అలర్ట్ చేశారు. ముమ్మర దర్యాప్తు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం వారు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ యువతిపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, కావాలనే నాటకమాడిందని గుర్తించారు. బాయ్ఫ్రెండ్ను దక్కించుకునేందుకే ఈ నాటకమాడిందని తెలుసుకొని విస్తుపోయారు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గ్యాంగ్రేప్ కట్టుకథ వ్యవహారం మహారాష్ట్రలోని నాగ్పుర్లో జరిగింది.
చిఖ్కాలీ ప్రాంతంలో తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని సోమవారం ఉదయం 11 గంటలకు సీతాబుల్దీ పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. మ్యూజిక్ క్లాస్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ అడ్రస్ అడిగిన వ్యాన్లోని ఇద్దరు.. తనను నిర్బంధించి చిఖ్కాలీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. సున్నితమైన అంశం కావడంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు.. వెంటనే 1000 మంది పోలీసులతో కూడిన 40 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు ప్రారంభించాయి. కమిషనర్ అమితేష్ కుమార్, అడిషనల్ సీపీ సునీల్ ఫులారీతో సహా ఇతర ఉన్నతాధికారులు కూడా ప్రత్యేక దృష్టిసారించారు.
పోలీసులు ఆరు గంటలపాటు శ్రమించి సుమారు 250 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. స్నేహితులు, బంధువులు సహా 50 మందిని ప్రశ్నించారు. అయితే.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలన తర్వాత పోలీసులకు అనుమానం వచ్చింది. ఆరోజు ఉదయం ఆమె బస్సులో, బైక్పై తిరిగినట్లు గుర్తించారు. దీంతో సదరు యువతిని గట్టిగా ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. కావాలనే గ్యాంగ్రేప్ నాటకమాడినట్లు సదరు యువతి ఒప్పుకొంది. తన బాయ్ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడానికే ఈ డ్రామా ఆడినట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నగదుంటేనే రైడ్ రైట్
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ