Crime News: మహిళతో వివాహేతర సంబంధం.. గొంతు నులిమి హత్య

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాప్రా-ఎల్లారెడ్డిగూడలో

Updated : 11 Sep 2021 02:16 IST

హైదరాబాద్‌ ‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాప్రా-ఎల్లారెడ్డిగూడలో నివాసించే మహిళను ఓ వ్యక్తి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని శామీర్‌పేట పరిధిలోని లాల్‌గాడి గ్రామశివారు వ్యవసాయ పొలంలో పాతిపెట్టాడు. మృతురాలి కుమారుడు తల్లి అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్యోదంతం వెలుగు చూసింది.  స్థానికంగా నివాసం ఉండే అశోక్‌ అనే వ్యక్తి తన తల్లితో చనువుగా ఉంటాడని.. అతనిపై అనుమానం ఉన్నట్లుగా మృతురాలి కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అశోక్‌ను విచారించగా.. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడి గొంతు నులిమి హత్య చేసినట్లుగా అంగీకరించాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని