ఫోన్ వచ్చింది మాట్లాడమ్మా.. తల్లి చనిపోయిందని తెలుసుకోలేని అమాయకత్వం
అమ్మ ఫోన్ రింగయింది. అంతే! మూడేళ్ల చిన్నారి పరుగున ఇంట్లోకెళ్లి దాన్ని చేతికందుకున్నాడు. ‘అమ్మా నీకు ఫోన్ వచ్చింది మాట్లాడు’ అంటూ సెల్ఫోన్ను తల్లి మొహం వద్ద పెట్టాడు. అమ్మ ఇక లేదని.. ఆమె అప్పటికే చనిపోయిందని.. తెలియని ఆ చిన్నారి తల్లి స్పందించకపోవడంతో బిక్కమొహం వేశాడు. ఫోన్ను తల్లి నోటి వద్దే ఉంచి అలా నిస్తేజంగా ఉండిపోయాడు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో యువ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడ్డారు.
యువ వైద్యురాలి బలవన్మరణం ఘటనలో విషాద కోణం
లింగాల, న్యూస్టుడే: అమ్మ ఫోన్ రింగయింది. అంతే! మూడేళ్ల చిన్నారి పరుగున ఇంట్లోకెళ్లి దాన్ని చేతికందుకున్నాడు. ‘అమ్మా నీకు ఫోన్ వచ్చింది మాట్లాడు’ అంటూ సెల్ఫోన్ను తల్లి మొహం వద్ద పెట్టాడు. అమ్మ ఇక లేదని.. ఆమె అప్పటికే చనిపోయిందని.. తెలియని ఆ చిన్నారి తల్లి స్పందించకపోవడంతో బిక్కమొహం వేశాడు. ఫోన్ను తల్లి నోటి వద్దే ఉంచి అలా నిస్తేజంగా ఉండిపోయాడు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో యువ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడ్డారు. అక్కడ కన్పించిన హృదయ విదారక దృశ్యమిది. లింగాలకు చెందిన కేతావత్ సోమశేఖర్కు, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలానికి చెందిన దివ్య (26)తో అయిదేళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తలిద్దరూ ఎంబీబీఎస్ పూర్తిచేశారు. వివాహమైన ఏడాది తరవాత సోమశేఖర్ ఉన్నత చదువుల కోసం భార్యతోపాటు దుబాయి వెళ్లారు. రెండు నెలల కిందట దంపతులు స్వగ్రామానికి తిరిగి వచ్చారు. దివ్యను, మూడేళ్ల కుమారుడు జ్ఞాని విరాట్ను తన తల్లిదండ్రుల వద్ద ఉంచి సోమశేఖర్ నెలక్రితం తిరిగి దుబాయి వెళ్లిపోయారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు సమాచారం.
బిడ్డను బయటకు పంపి
బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అత్తామామలు వరండాలో కూర్చొని ఉండగా దివ్య కుమారుడిని బయటకు పంపించి లోపల తాళం వేసుకున్నారు. తర్వాత చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకున్నారు. బిడ్డ తలుపు తడుతూ ఏడుస్తుండటంతో తేరుకున్న అత్తమామలు, చుట్టుపక్కల వారి సాయంతో బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి మృతి చెందిన విషయం తెలియని మూడేళ్ల చిన్నారి రింగయిన ఫోన్ను అమ్మకు ఇచ్చేంద]ుకు చేసిన ప్రయత్నం అక్కడున్న వారిని చలింపజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం