Crime news: ప్రేమ పేరుతో మోసపోతే.. పోలీసులు ప్రాణం కాపాడారు
‘‘ప్రేమ పేరుతో నమ్ముకొని వచ్చిన అఖిల్ మోసం చేశాడు. సమాజంలో ఎదురయ్యే అవమానాలను భరించే ధైర్యం లేదు. గత్యంతరం లేని పరిస్థితులో ఆత్మహత్య చేసుకుంటున్నా
విజయవాడ: ‘‘ప్రేమ పేరుతో నమ్ముకొని వచ్చిన అఖిల్ మోసం చేశాడు. సమాజంలో ఎదురయ్యే అవమానాలను భరించే ధైర్యం లేదు. గత్యంతరం లేని పరిస్థితులో ఆత్మహత్య చేసుకుంటున్నా. నా కుమార్తెను పోలీసులు చేరదీసి ఆదుకోవాలి’’ అని కోరుతూ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఓ మహిళ దిశకు ఎస్వోఎస్ సందేశాన్ని పంపింది.
దిశ యాప్కు సమాచారం వచ్చిన నెంబరు ఆధారంగా మహిళ ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన దిశ కంట్రోల్ రూం సిబ్బంది హుటాహుటిన విజయవాడలోని అజిత్సింగ్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి సమీపంలో విధులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ సిబ్బంది సకాలంలో స్పందించి 10 నిమిషాల వ్యవధిలో మహిళ ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే గుర్తు తెలియని విషం తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను గుర్తించిన పోలీసులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రాణాలు నిలబెట్టారు. ఆ మహిళతో పాటు ఉన్న ఐదేళ్ల చిన్నారిని చేరదీసిన అజిత్సింగ్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్