Crime News: దారి తప్పిన ‘కుర్రోడు’.. చిన్నారుల నీలిచిత్రాలు అమ్ముతుండగా అరెస్ట్
ఇంజినీరింగ్ చదివిన కుర్రాడు దారితప్పాడు. పలు ఉద్యోగాలు చేసి మానేసిన అతడు, కాలక్షేపం కోసం నీలి చిత్రాలు చూడడం అలవాటు చేసుకున్నాడు. ఓ ప్రకటన చూసి చిన్నారుల వీడియోలను కొనుగోలు చేశాడు.
నిందితుడు సొహైల్
ఈనాడు - అమరావతి: ఇంజినీరింగ్ చదివిన కుర్రాడు దారితప్పాడు. పలు ఉద్యోగాలు చేసి మానేసిన అతడు, కాలక్షేపం కోసం నీలి చిత్రాలు చూడడం అలవాటు చేసుకున్నాడు. ఓ ప్రకటన చూసి చిన్నారుల వీడియోలను కొనుగోలు చేశాడు. ఆతర్వాత.. వీటిని మరొకరికి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయాడు. చిన్నారులతో చేసిన నీలి చిత్రాలకు సంబంధించి ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో తనిఖీలు చేసింది. సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేసింది. ఈ తరహా నేరం చేసే విజయవాడ నగరానికి చెందిన యువకుడు అరెస్టు అయ్యాడు.
రెట్టింపునకు అమ్ముతూ
విజయవాడ ఫకీరుగూడెం ప్రాంతానికి చెందిన సొహైల్ అహ్మద్.. ఓ ప్రముఖ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ చదివాడు. హైదరాబాద్, అమరావతిలో పలు ఉద్యోగాలు చేశాడు. ఎక్కడా ఆశించిన జీతం రాకపోవడంతో తరచూ మానేసి, మరొకటి వెతుక్కునే వాడు. ఈ మధ్య ఆన్లైన్లో ఎక్కువ సమయం నీలి చిత్రాలు చూసేవాడు. టెలిగ్రామ్లోని ఓ గ్రూప్లో ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. చిన్నారుల నీలిచిత్రాలు అమ్మతామన్నది దాని సారాంశం. ప్రకటనలో ఇచ్చిన నెంబరుకు ఫోన్ చేసి, సంప్రదించాడు. రూ. 250కు బేరం కుదుర్చుకుని నగదును ఆన్లైన్ ద్వారా బదిలీ చేశాడు. అవతలి వ్యక్తి పంపిన లింక్ను సొహెల్ క్లిక్ చేయగా, 4 వేల వీడియోలు ఉన్నాయి. అవన్నీ 18 ఏళ్లు లోపువారివే. వీటిని ఎక్కువ ధరకు ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చని సామాజిక మాధ్యమాల్లో ప్రకటన ఇచ్చాడు. దీనిని దిల్లీకి చెందిన ఎన్సీపీసీఆర్ (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) ప్రతినిధి చూసి సొహెల్తో కొంటానంటూ సంప్రదించారు. వీటిని రూ. 500కు అతడికి విక్రయించాడు. దీనిపై ఎన్సీపీసీఆర్ ప్రతినిధి అను చౌదరి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు విజయవాడకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడి సైబర్ క్రైమ్ స్టేషన్కు బదిలీ అయింది. నగర పోలీసులు పోస్కో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి, నిందితుడు సొహెల్ను అరెస్ట్ చేశారు. ఎక్కడి నుంచి వీడియోలు వచ్చాయి? ఇంకా ఎవరెవరికి విక్రయించాడు? అన్న కోణంలో విచారిస్తున్నారు.
చూసినా.. షేర్ చేసినా నేరమే..
పోస్కో చట్టం ప్రకారం యుక్త వయసు లోపు ఉన్న వారితో అభ్యంతరకరమైన చిత్రాలు తీయడం పూర్తిగా నిషేధం. తీసినా, సేకరించినా, చూడడం, ఇతరులకు పంపడం కూడా నేరం కిందకు వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి కంటెంట్ను ఆన్లైన్లో శోధించే వారిపై నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నిఘా పెట్టింది. ఇటువంటి వారి ఐపీ చిరునామాల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా