Crime news: యువకుడిని కాటేసిన ప్రేమ వ్యవహారం!

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. వట్టిచెరుకూరు మండలం పల్లపాడుకు

Published : 12 Oct 2021 01:39 IST

గుంటూరు: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. వట్టిచెరుకూరు మండలం పల్లపాడుకు చెందిన బండారు గోపీ (19) అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. అయితే, వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టంలేకపోవడంతో కిరాయి ముఠాతో యువకుడిని చంపించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమారుడు కనిపించలేదంటూ గోపీ తల్లిదండ్రులు  పోలీసులకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు.. యువకుడు హత్యకు గురైనట్టు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని