Crime news: తాడేపల్లిగూడెంలో రౌడీషీటర్‌ దారుణ హత్య

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో శనివారం సాయంత్రం రౌడీషీటర్‌ దారుణహత్యకు గురయ్యాడు. అతనితోపాటు ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి

Published : 02 Jan 2022 01:29 IST

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో శనివారం సాయంత్రం రౌడీషీటర్‌ దారుణహత్యకు గురయ్యాడు. అతనితోపాటు ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. జువ్వలపాలెంనకు చెందిన దొరబాబు(35) రౌడీ షీటర్. పలు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న దొరబాబును గుర్తు తెలియని వ్యక్తులు ఓవర్‌ బ్రిడ్జి కింద ఉన్న శ్రీనివాస్‌ లాడ్జి ఎదుట వెంటాడి బ్లేడుతో గొంతు కోసి పరారయ్యారు. అతడితో పాటు మరో వ్యక్తిపై కూడా బ్లేడుతో దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో దొరబాబు అక్కడికక్కడే మృతి చెందగా, విషమంగా ఉన్న మరో వ్యక్తిని తణుకు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని