Suicide: తప్పనిపించి.. తనువు చాలించి
ప్రేమించాడు.. కాదన్నందుకు హత్యాయత్నం చేశాడు. తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు.. చివరికి తనువు చాలించాడు. గతనెల 28న గచ్చిబౌలిలో యువతిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన ప్రేమోన్మాది ప్రేమ్సింగ్ (21) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రేమ్సింగ్
జీడిమెట్ల, న్యూస్టుడే: ప్రేమించాడు.. కాదన్నందుకు హత్యాయత్నం చేశాడు. తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు.. చివరికి తనువు చాలించాడు. గతనెల 28న గచ్చిబౌలిలో యువతిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన ప్రేమోన్మాది ప్రేమ్సింగ్ (21) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీటెక్ చదువుతున్న ప్రేమ్సింగ్ వట్టినాగులపల్లిలో ఉండే ఓ యువతిని ప్రేమించాడు. ఆమె వద్దన్నదనే కోపంతో అక్టోబరు 28న ఆమె ఇంటికెళ్లి కత్తితో పొడిచి చంపేందుకు యత్నించాడు. ఆమె అరుపులతో మేల్కొన్న ఇంటి సభ్యులు అతన్ని పట్టుకొని చితకబాదారు. ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చారు. కాలు విరిగిన అతడు చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఓ గదిలో వేరుగా ఉంటున్నాడు. కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న ప్రేమ్ నవంబరు 27 రాత్రి 10 గంటలకు భోజనం తర్వాత గదిలోకి వెళ్లిపోయాడు. కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న కుమారుడ్ని తల్లి పట్టించుకోలేదు. సోమవారం రాత్రి దాకా బయటికి రాకపోవడంతో పిలిచినా పలకకపోవడంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో డయల్ 100కు ఫోన్ చేసి విషయాన్ని తెలపగా పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టారు. ఫ్యాన్కు ఉరేసుకుని ప్రేమ్ కనిపించడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. ప్రేమ వైఫల్యమే మృతికి కారణంగా గుర్తించామని జీడిమెట్ల సీఐ బాలరాజు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?