AP News: నాన్నా.. అక్క దగ్గరకు వెళ్తున్నా.. అదృశ్యమైన యువకుడి మృతి

అపురూపంగా చూసుకుంటున్న కుమార్తె కారు ప్రమాదంలో కొద్ది రోజుల కిందట మృతి చెందింది. ఆ బాధను మరిచిపోయేలోపే ఒక్కగానొక కుమారుడి మరణ వార్త ఆ తల్లిదండ్రులను తల్లడిల్లేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. తాడేపల్లిగూడెం పట్టణం

Updated : 11 Aug 2021 09:35 IST

 


లోకాభిజిత్‌ (పాత చిత్రం)

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: అపురూపంగా చూసుకుంటున్న కుమార్తె కారు ప్రమాదంలో కొద్ది రోజుల కిందట మృతి చెందింది. ఆ బాధను మరిచిపోయేలోపే ఒక్కగానొక కుమారుడి మరణ వార్త ఆ తల్లిదండ్రులను తల్లడిల్లేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం భూపాల్‌నగర్‌ ప్రాంతానికి చెందిన లింగంపల్లి లోకాభిజిత్‌ (22) సోమవారం తెల్లవారుజాము నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. లోకాభిజిత్‌ గణపవరం మండలం ఎనికేపల్లి గ్రామంలోని పంటకాలువ లాకుల వద్ద మంగళవారం విగతజీవిగా కనిపించారు. అక్క లేదనే బాధతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ‘నాన్నా.. నేను కూడా అక్క దగ్గరకు వెళ్లిపోతున్నా.. నీ బాధ చూడలేకపోతున్నా’ అని చరవాణిలో మెసేజ్‌ పెట్టి ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో గుర్తు తెలియనిచోట కాలువలో దూకిన యువకుడు ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చి ఎనికేపల్లి గ్రామంలోని లాకుల వద్ద చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న నిడమర్రు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పట్టణ పోలీసుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమార్తె, కుమారుడు ఒకరి తర్వాత మరొకరు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై పట్టణ సీఐ ఆకుల రఘు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని