
Updated : 03 Dec 2021 10:39 IST
Crime News: శ్రీశైలం ఘాట్రోడ్లో విషాదం.. బస్సులో అజాగ్రత్తే యువతి ప్రాణం తీసింది!
శ్రీశైలం ఆలయం: కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణంలో అజాగ్రత్తే ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మహి(20) కార్తిక మాసం సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం గురువారం ఆర్టీసీ బస్సులో బయలు దేరింది. శ్రీశైలానికి పది కిలోమీటర్ల దూరంలోని నల్లమల ఘాట్ రోడ్డు మలుపు వద్దకు రాగానే ఆమె తల కిటికీలోంచి బయటకు పెట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ యువతి తలకు బలంగా తగిలింది. ఈ దుర్ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. యువతి గుంటూరు జిల్లా నర్సరావుపేటలో డిగ్రీ చదువుతున్నట్లు సమాచారం.
Tags :