TS News: పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య ఘటన.. మరో విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో సోమవారం జరిగిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో మరో విషాదం చోటు ..

Updated : 05 Jan 2022 17:14 IST

ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో సోమవారం జరిగిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో మరో విషాదం చోటు చేసుకుంది. మృత్యువుతో పోరాడుతూ కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ చిన్న కుమార్తె సాహితీ ఈరోజు ఉదయం మృతి చెందింది. భార్య, పిల్లలకు నిప్పంటించి రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు, పెద్దకుమార్తె సాహిత్య సజీవదహనమయ్యారు. కాగా తన ఆత్మహత్యకు తెరాస నేత వనమా రాఘవేంద్రరావే ప్రధాన కారణమని రామకృష్ణ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో అతన్ని ఏ2గా చేర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని