Crime News: వారి నుంచి ప్రాణహాని ఉంది.. కడప ఎస్పీకి వివేకా పీఏ ఫిర్యాదు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొందరు తనపై ఒత్తిడి చేస్తున్నారని వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కడప ఎస్పీ అన్బు రాజన్ను కలిసి నాలుగు పేజీల లేఖను అందించారు. వివేకా కుమార్తె సునీ...
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొందరు తనపై ఒత్తిడి తెస్తున్నారని వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కడప ఎస్పీ అన్బు రాజన్ను కలిసి నాలుగు పేజీల లేఖను అందించారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్రెడ్డితో పాటు శివప్రకాశ్రెడ్డి అనే మరో వ్యక్తి పేరును ఫిర్యాదులో ప్రస్తావించారు. వీరి వల్ల తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని ఎస్పీ అన్బు రాజన్ను కోరారు. కృష్ణారెడ్డి తనకు ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ అన్బు రాజన్ సైతం ధ్రువీకరించారు. కృష్ణారెడ్డి గత 30 ఏళ్లుగా వివేకా ఇంట్లో పనిచేస్తున్నారని ఎస్పీ చెప్పారు.
వివేకా హత్య కేసు విషయంలో గత కొంత కాలంగా కొంత మంది వివేకా కుటుంబసభ్యులపై పలు ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. 20 రోజుల క్రితం అనంతపురం జిల్లా యాడికి ప్రాంతానికి చెందిన గంగాధర్ రెడ్డి, పులివెందులకు చెందిన భరత్కుమార్ ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను కలిసి వివేకా కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశారు. వివేకా కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉన్న కృష్ణారెడ్డి ఏకంగా వివేకా కుమార్తె, ఆమె భర్తపై ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. -
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ ఆలౌట్.. ముంబయి థ్రిల్లింగ్ విక్టరీ
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం