Murder: కడప జిల్లాలో వైకాపా సర్పంచ్‌ దారుణ హత్య

కడప జిల్లా లింగాల మండలం కోమనూతల సర్పంచ్‌ దారుణహత్యకు గురయ్యారు. వైకాపాకు చెందిన సర్పంచ్‌ మునెప్ప(50)ను ప్రత్యర్థులు దారుణంగా చంపారు. సర్పంచ్‌ల

Updated : 28 Jul 2021 13:19 IST

లింగాల: కడప జిల్లా లింగాల మండలం కోమనూతల సర్పంచ్‌ దారుణహత్యకు గురయ్యారు. వైకాపాకు చెందిన సర్పంచ్‌ మునెప్ప(50)ను ప్రత్యర్థులు దారుణంగా చంపారు. సర్పంచ్‌ల శిక్షణా తరగతులకు హాజరయ్యేందుకు మునెప్ప పులివెందులకు వెళ్లారు. తన ద్విచక్రవాహనంలో ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో 150 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా మునెప్ప గెలుపొందారు. ఆధిపత్య పోరుతోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని