Zero FIR on tadepalli SI: తాడేపల్లి ఎస్‌ఐపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు

గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్‌ఐ బాలకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఎస్‌ఐ బాలకృష్ణ తనను మోసం చేశారంటూ ఓ మహిళ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ ముందు ..

Published : 26 Jul 2021 01:58 IST

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్‌ఐ బాలకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఎస్‌ఐ బాలకృష్ణ తనను మోసం చేశారంటూ ఓ మహిళ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్పందించిన పోలీసులు ఆ మహిళపై వెంటనే నీళ్లు పోసి పక్కకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు ఎస్‌ఐని వీఆర్‌కు పిలిచారు. గతంలో గుంటూరు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో బాలకృష్ణ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇదే మహిళ తనను మోసం చేశారంటూ ఫిర్యాదు చేశారు. అప్పుడు బాలకృష్ణపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం తాడేపల్లికి బదిలీ చేశారు. ఈనెల 23న రాత్రి సమయంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మళ్లీ అదే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాలకృష్ణ మోసం చేశారని ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని