AP News: ఉద్యోగం నచ్చక ఆర్‌ఎస్సై బలవన్మరణం

తల్లిదండ్రులు కోరిక మేరకు పోలీసు ఉద్యోగం సంపాదించారు. మనసులో మాత్రం పోలీసు ఉద్యోగం ఇష్టం లేదు. కొద్ది నెలలు పని చేశారు. ఇష్టం లేని ఉద్యోగం చేయలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక కుమిలిపోతూ ఏకంగా తనువే చాలించారు ఓ యువ

Updated : 31 Dec 2021 08:43 IST

పైలా చంద్రారావు (దాచిన చిత్రం)

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు కోరిక మేరకు పోలీసు ఉద్యోగం సంపాదించారు. మనసులో మాత్రం పోలీసు ఉద్యోగం ఇష్టం లేదు. కొద్ది నెలలు పని చేశారు. ఇష్టం లేని ఉద్యోగం చేయలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక కుమిలిపోతూ ఏకంగా తనువే చాలించారు ఓ యువ ఆర్‌ఎస్సై. కడప చిన్నచౌకు ఎస్సై రోషన్‌ తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామానికి చెందిన పైలా చంద్రారావు(26) ఆర్‌ఎస్సైగా 2021లో కడప ఏఆర్‌ విభాగంలో విధుల్లో చేరారు. కడప ఎన్జీవో కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇంకా వివాహం కాలేదు. మొదటి నుంచి చంద్రారావుకు ఉద్యోగమంటే ఇష్టం లేదు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఉద్యోగంలో చేరారు. ఈనెల 10న సొంతూరికి వెళ్లి 28వ తేదీ తిరిగి కడపకు వచ్చారు. ఇంటి వద్ద ఏమి జరిగిందో తెలియదు. గురువారం తన గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకున్నారు. తోటి స్నేహితులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి ఓ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసి ఉంది. ఎస్పీ అన్బురాజన్‌, డీఎస్పీ వెంకటశివారెడ్డి మృతదేహాన్ని పరిశీలించి నివాళి అర్పించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని