AP News: ఉద్యోగం నచ్చక ఆర్ఎస్సై బలవన్మరణం
తల్లిదండ్రులు కోరిక మేరకు పోలీసు ఉద్యోగం సంపాదించారు. మనసులో మాత్రం పోలీసు ఉద్యోగం ఇష్టం లేదు. కొద్ది నెలలు పని చేశారు. ఇష్టం లేని ఉద్యోగం చేయలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక కుమిలిపోతూ ఏకంగా తనువే చాలించారు ఓ యువ
పైలా చంద్రారావు (దాచిన చిత్రం)
కడప నేరవార్తలు, న్యూస్టుడే: తల్లిదండ్రులు కోరిక మేరకు పోలీసు ఉద్యోగం సంపాదించారు. మనసులో మాత్రం పోలీసు ఉద్యోగం ఇష్టం లేదు. కొద్ది నెలలు పని చేశారు. ఇష్టం లేని ఉద్యోగం చేయలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక కుమిలిపోతూ ఏకంగా తనువే చాలించారు ఓ యువ ఆర్ఎస్సై. కడప చిన్నచౌకు ఎస్సై రోషన్ తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామానికి చెందిన పైలా చంద్రారావు(26) ఆర్ఎస్సైగా 2021లో కడప ఏఆర్ విభాగంలో విధుల్లో చేరారు. కడప ఎన్జీవో కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇంకా వివాహం కాలేదు. మొదటి నుంచి చంద్రారావుకు ఉద్యోగమంటే ఇష్టం లేదు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఉద్యోగంలో చేరారు. ఈనెల 10న సొంతూరికి వెళ్లి 28వ తేదీ తిరిగి కడపకు వచ్చారు. ఇంటి వద్ద ఏమి జరిగిందో తెలియదు. గురువారం తన గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకున్నారు. తోటి స్నేహితులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి ఓ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసి ఉంది. ఎస్పీ అన్బురాజన్, డీఎస్పీ వెంకటశివారెడ్డి మృతదేహాన్ని పరిశీలించి నివాళి అర్పించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?