TS NEWS: తీన్మార్ మల్లన్నను 5గంటల పాటు విచారించిన పోలీసులు
చిలకలగూడ పోలీస్స్టేషన్లో తీన్మార్ మల్లన్నను పోలీసులు 5గంటల పాటు విచారించారు. అనంతరం విడుదల చేశారు.
సికింద్రాబాద్: చిలకలగూడ పోలీస్స్టేషన్లో తీన్మార్ మల్లన్నను పోలీసులు 5గంటల పాటు విచారించారు. అనంతరం విడుదల చేశారు. ఈనెల 8న మరోసారి విచారణకు హాజరు కావాలని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని ఈ సందర్భంగా మల్లన్న స్పష్టం చేశారు.
తన ప్రతిష్ఠకు భంగం కలిగించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్పై ఓ యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సహోద్యోగి, స్నేహితుడైన చిలక ప్రవీణ్ గత కొంతకాలంగా తీన్మార్ మల్లన్న అవినీతి అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా మల్లన్న వ్యవహరిస్తున్నారని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీర్జాదిగూడలోని తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానల్పై పోలీసులు మంగళవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. ఒక్కొక్కరుగా కార్యాలయానికి చేరుకున్న పోలీసులు కార్యాలయ సిబ్బందిని బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పలు పత్రాలు పరిశీలించి, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!