వ్యాన్‌ బోల్తా.. 10మంది మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శివపురి జిల్లాలోని పోహ్రి వద్ద ఓ వ్యాన్‌ బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతిచెందగా.. 20 మందికి గాయాలయ్యాయి.............

Published : 13 Nov 2020 21:55 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శివపురి జిల్లాలోని పోహ్రి వద్ద ఓ వ్యాన్‌ బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతిచెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. షియోపూర్‌ జిల్లాలోని ఉన్‌వాడ్‌లోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని తమ సొంత గ్రామమైన దోడికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు శివపురి జిల్లా ఎస్పీ రాజేశ్ సింగ్‌ చండేల్‌ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. క్షతగాత్రులను శివపురి జిల్లాలోని ఆస్పత్రుల్లో చేర్పించినట్టు తెలిపారు. 

ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి మరో ముగ్గురు..

మరోవైపు, పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో ఆయిల్‌ ట్యాంకర్‌ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రోడ్డు పక్కనఓ తినుబండారాల దుకాణం వద్ద నిలిపి ఉంచిన సమయంలో ఒక్కసారిగా ట్యాంకర్‌ పేలింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని