ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కంటెయినర్‌‌.. లారీ ఢీకొన్న ఘటనలో 10 మంది మృతిచెందారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున వడోదర సమీపంలో జరిగింది........

Updated : 18 Nov 2020 13:22 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కంటెయినర్‌, లారీ పరస్పరం ఢీకొన్న ఘటనలో 10 మంది మృతిచెందారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున వడోదర సమీపంలో జరిగింది. లారీ సూరత్‌ నుంచి పావగఢ్‌కు వెళ్తుండగా వడోదర శివారులోని వాగోడియా క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న వంతెనపై కంటైనర్‌ను ఢీకొంది. దీంతో రహదారిపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని