Crime News: భూవివాదం నేపథ్యంలో హింస.. బాంబులతో దాడి!

ఒడిశా పూరీ జిల్లాలోని నాథపుర్ గ్రామంలో భూవివాదం హింసాత్మకంగా మారింది. గ్రామంపై కొందరు దుండగులు 20కిపైగా బాంబులు విసిరారు.

Published : 10 Nov 2021 01:35 IST

పూరీ: ఒడిశాలో పూరీ జిల్లాలోని నాథపుర్ గ్రామంలో భూవివాదం హింసాత్మకంగా మారింది. గ్రామంపై కొందరు దుండగులు 20కిపైగా బాంబులు విసిరారు. ఈ ఘటనలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. నాథపుర్ గ్రామంలో.. 35 మౌజా ప్రాంతంలోని ఓ భూ వివాదం నేపథ్యంలో దుండగులు ఈ బాంబు దాడులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 30 ఇళ్లు దగ్ధమవ్వగా.. పలు వాహనాలు దెబ్బతిన్నాయని, పలువురికి గాయాలయ్యాయని వివరించారు. దాడి సమాచారం తెలిసిన వెంటనే పూరీ అదనపు ఎస్పీ నేతృత్వంలో గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసులను భారీగా మోహరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని