Crime News: కోడలి తల నరికి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చిన అత్త

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కె.రామాపురంలో దారుణం చోటు చేసుకుంది. కోడలిని దారుణంగా హత్య చేసిన ఓ అత్త ఏకంగా ఆమె తలతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి...

Updated : 11 Aug 2022 18:52 IST

రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కె.రామాపురంలో దారుణం చోటు చేసుకుంది. కోడలిని దారుణంగా హత్య చేసిన ఓ అత్త ఏకంగా ఆమె తలతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కె.రామాపురానికి చెందిన సుబ్బమ్మ తన కోడలు(సొంత అక్క కోడలు) వసుంధర(35)ను ఇంటికి భోజనానికి పిలిచింది. అప్పటికే ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నింది. సుబ్బమ్మతో పాటు ఆమె సమీప బంధువులు కలిసి వసుంధరను దారుణంగా నరికి తలను వేరు చేశారు. సుబ్బమ్మ కోడలి తల చేత పట్టుకొని సుమారు 6కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటి టౌన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఆ దృశ్యం చూసిన వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. కుటుంబ కలహాలతో పాటు ఆస్తి గొడవలే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని