కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌లో బోటు దగ్ధం 

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద ఓ చేపల బోటు శుక్రవారం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన బొడ్డు నూకరాజుకు తీవ్ర

Published : 23 Jan 2021 01:53 IST

జగన్నాథపురం (కాకినాడ): తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద ఓ చేపల బోటు శుక్రవారం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన బొడ్డు నూకరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 

కాకినాడలోని ఏటిమొగకు చెందిన పంతాటి కామేశ్వరరావు తన బోటు (ఐఎన్‌డీ-ఏపీ-ఈ2-717)లో సుమారు 4 వేల లీటర్ల డీజిల్‌ నింపుకొని చేపల వేటకు సిద్ధమవుతుండగా షార్ట్‌సర్క్యూట్‌ అయి ఆయిల్‌ ట్యాంక్‌ వద్ద మంటలు వ్యాపించాయి. దీంతో బోటు మొత్తం పూర్తి దగ్ధమైంది. ఈ ఘటనపై కాకినాడ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆస్పత్రిలోని క్షతగాత్రులను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి పరామర్శించారు. 

ఇవీ చదవండి..

ప్రేమ పేరుతో ఉన్మాది ఘాతుకం

శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు