The Kashmir Files: అమిత్ షాను కలిసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినీ బృందం
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించే చర్చ. 1990ల్లో కశ్మీరీ హిందువులపై జరిగిన నరమేధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన......
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) సినిమా గురించే చర్చ. 1990ల్లో కశ్మీరీ పండిట్లపై జరిగిన నరమేధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమాపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న సినిమాగా రూపొంది భారీ కలెక్షన్లు రాబడుతోంది. కాగా ఈ చిత్ర బృందం తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్షాను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం అల్పాహారానికి తమ చిత్ర బృందాన్ని అమిత్ షా ఆహ్వానించినట్లు సినిమాలో కీలక పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. హోంమంత్రితో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.
ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వికేవ్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్, అనుపమ్ ఖేర్, మరో ముఖ్య పాత్ర పోషించిన పల్లవి జోషి.. అమిత్ షాను కలిశారు. ‘ఆర్టికల్ 370 రద్దు చేయడంలో ముఖ్య పాత్ర పోషించి, ఎంతో మందికి విముక్తి కలిగించిన హోంమంత్రి అమిత్షా గారికి ధన్యవాదాలు. ది కశ్మీర్ ఫైల్స్ బృందాన్ని బ్రేక్ఫాస్ట్కు మీ ఇంటికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. దేశ భద్రత, అభివృద్ధి పట్ల మీరు చూపించే అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకం’ అంటూ అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు.
వివేక్ అగ్నిహోత్రి సైతం అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మీ ఈ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహసోపేత నిర్ణయం తీసుకొని ప్రజల హృదయాలను దగ్గరచేసే ప్రక్రియను ప్రారంభించారు. కశ్మీర్ ప్రజల భద్రత, వారి మానవ హక్కుల కోసం మీరు చేస్తున్న స్థిరమైన కృషి అభినందనీయం. శాంతియుత, సంపన్న కశ్మీర్ కోసం మీ సంకల్పం హర్షణీయం’ అంటూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు