Shraddha Murder: హత్య తర్వాత ఆఫ్తాబ్ ఇంటికి యువతి.. ఆమె ఓ సైకాలజిస్ట్ అట..!
శ్రద్ధా హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులు అడిగే ప్రశ్నలను ఆఫ్తాబ్ ముందే ఊహించి ప్రాక్టీస్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. విచారణలో భాగంగా వారు పలు విషయాలు గుర్తిస్తున్నారు.
దిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నిందితుడు ఆఫ్తాబ్ ఓ పక్క ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్లో ఉంచి.. మరో యువతిని పలు మార్లు తన అపార్ట్మెంట్కు పిలిచినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా ఇంటికి వచ్చిన యువతి ఒక డాక్టర్ అని, సైకాలజిస్ట్ అని పోలీసులు గుర్తించారు. శ్రద్ధాతో పరిచయం ఏర్పడిన డేటింగ్ యాప్ ద్వారానే ఆమె కూడా కలిసింది. దర్యాప్తులో భాగంగా ఆ డేటింగ్ యాప్ నుంచి పలు వివరాలు తెలుసుకున్నారు. అంతేకాదు దానిని వాడి పలువురు మహిళలను కూడా అతడు కలిసినట్లు తెలుస్తోంది.
ఆ ప్రశ్నలు ముందే ప్రాక్టీస్ చేశాడా..?
హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులు అడిగే ప్రశ్నలను ఆఫ్తాబ్ ముందే ఊహించగలిగాడా..? వాటికి ఎలా సమాధానం ఇవ్వాలో ముందుగానే ప్రాక్టీస్ చేశాడా..? అతడికి పాలిగ్రాఫ్ పరీక్ష చేసిన అధికారులకు ఇలాంటి అనుమానాలే తలెత్తినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొన్ని ప్రశ్నలకు ఎంతో నిబ్బరంగా అబద్ధాలు చెప్పినట్లు పేర్కొన్నాయి. విచారణాధికారి ఒకరు దృశ్యం సినిమా చూశారా? అని ప్రశ్నించగా.. అతడు ఒక చిరునవ్వు నవ్వాడని ఓ వార్తాసంస్థ కథనం పేర్కొంది. ‘పాలిగ్రాఫ్ పరీక్షలో భాగంగా రీడింగ్లకు అంతరాయం కలిగించేలా వ్యవహరించాడు. ఎలక్ట్రోడ్లను అతడి శరీరానికి పెట్టగానే దగ్గడం ప్రారంభించాడు. దగ్గువల్ల రీడింగ్లో అంతరాయం ఏర్పడేది. దాంతో అతడు చెప్పేది నిజమా..? లేక పరీక్షను తప్పుదోవ పట్టించేందుకు అలా ప్రవర్తించాడా..? అనేది తెలుసుకోవడం క్లిష్టంగా మారింది’ అని వెల్లడించింది. దాంతో మరోసారి పాలిగ్రాఫ్ పరీక్ష చేయాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం అతడికి నార్కో అనాలసిస్ పరీక్ష చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కోర్టు అతడిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు డేటింగ్ యాప్లో పరిచయమైన డాక్టర్కు సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్