Hyderabad News: పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో చోరీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో చోరీ జరిగింది. జూబ్లీహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌లో

Updated : 11 Jun 2022 14:34 IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో చోరీ జరిగింది. జూబ్లీహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో 30 కాపర్‌ బండిల్స్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. నిర్మాణ సంస్థ ప్రతినిధి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ ఘటనపై నిర్మాణ సంస్థ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించనున్నారు. హైదరాబాద్‌లోని అణువణువు నిఘా పెట్టేందుకు, ఏక్షణంలో ఎక్కడ ఏం జరిగానా క్షణాల్లో పసిగట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కమాండ్‌ కంట్రోల్‌ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని