రూ.30 దొంగతనం: 31 ఏళ్ల తర్వాత అరెస్టు!
అది హరియాణా రాష్ట్రంలోని కైతల్ అనే పట్టణం. తాజాగా స్థానిక కోర్టులో పోలీసులు ఓ వ్యక్తిని ముద్దాయిగా నిల్చుబెట్టారు. అతడు చేసిన నేరం ఏంటో తెలుసా? ఓ రైతు జేబులో నుంచి 30 రూపాయలు దొంగతనం. అది కూడా ఇప్పటి దొంగతనం కాదు.. 31 ఏళ్ల కిందటది. పోలీసులు సైతం
చండీగఢ్: అది హరియాణా రాష్ట్రంలోని కైతల్ అనే పట్టణం. స్థానిక కోర్టులో పోలీసులు ఓ వ్యక్తిని ముద్దాయిగా నిల్చొబెట్టారు. అతడు చేసిన నేరం ఏంటో తెలుసా? ఓ రైతు జేబులో నుంచి 30 రూపాయలు దొంగతనం. అది కూడా ఇప్పటి దొంగతనం కాదు.. 31 ఏళ్ల కిందటిది. పోలీసులు సైతం అప్పుడే అతడిని అరెస్టు చేశారు. దీంతో జైలుకెళ్లి బయటకు వచ్చాడు. మూడు దశాబ్దాల తర్వాత పోలీసులు అతడిని తిరిగి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసు భలే విచిత్రంగా ఉంది కదా..! పూర్తి వివరాల్లోకి వెళితే..
1990 డిసెంబర్ 3న జస్వంతి గ్రామానికి చెందిన కరమ్ సింగ్ అనే రైతు జేబులో నుంచి ఓ దొంగ రూ.30 ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు కైతల్ పట్టణంలోని సదార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని అదే రోజు దొంగను పట్టుకున్నారు. దొంగ పేరు సుభాష్గా గుర్తించారు. అతడి నుంచి రూ.30 స్వాధీనం చేసుకొని జైలుకు పంపించగా.. మరుసటి రోజే సుభాష్ బెయిల్పై బయటకు వచ్చాడు. నిబంధనల ప్రకారం నిందితులు బెయిల్పై బయటకొచ్చినా.. పోలీసులు ఎప్పుడు పిలిచినా వచ్చేలా అందుబాటులో ఉండాలి. కానీ, సుభాష్ అక్కడి నుంచి పారిపోయి తిరిగి పోలీస్ స్టేషన్కు వెళ్లలేదు. దీంతో 1996లో సుభాష్ను పారిపోయిన నేరస్థుల జాబితాలో చేర్చారు.
అయితే, కొన్ని రోజుల కిందట కైతల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు పారిపోయిన నేరస్థులను తిరిగి అదుపులోకి తీసుకునే కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో పలు చోట్ల దాడులు చేసి నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 31 ఏళ్ల కిందట రూ.30 దొంగతనం చేసిన సుభాష్ కూడా ఉన్నాడు. బుధవారం పోలీసులు అతడిని కోర్టులో హాజరుపర్చారు. దీంతో సుభాష్ తన తప్పును ఒప్పుకున్నాడు. జైల్లో ఒక రోజు కూడా ఉన్నానని చెప్పాడు. దీంతో అతడు చేసిన నేరానికి ఒక రోజు జైల్లో ఉండటం వల్ల అప్పుడే శిక్షకాలం ముగిసిందని, ఇప్పుడు సుభాష్ను విడుదల చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం 52ఏళ్లు ఉన్న సుభాష్ 21ఏళ్ల వయసులో ఆ దొంగతనం చేశాడు. ఆ తర్వాత అతడు వివాహం చేసుకొని జీవనం కొనసాగించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు