Burglary: దొంగతనానికి వెళ్లి.. కిచిడీ వండి.. అడ్డంగా దొరికిపోయి..!
తీరిగ్గా ఇంట్లోకి చొరబడిన ఆ దొంగ.. ఆకలి వేయడంతో అదే ఇంట్లో వంటకు ఉపక్రమించాడు. అయితే ఈ చర్యే అతడిని పోలీసులకు పట్టించింది.......
గువాహటి: దొంగతనానికి వెళ్లిన వాళ్లు చడీచప్పుడు కాకుండా ఉన్నదంతా దోచుకొని ఉడాయిస్తారు. కానీ ఇక్కడ ఓ చోరుడు మాత్రం అలా చేయలేదు. తీరిగ్గా ఇంట్లోకి చొరబడిన ఆ దొంగకు ఆకలి వేయడంతో అదే ఇంట్లో వంటకు ఉపక్రమించాడు. అయితే ఈ చర్యే అతడిని పోలీసులకు పట్టించింది. అస్సాం గువాహటిలోని హెంగెరాబారి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన ఓ దొంగ తాళం పగులగొట్టి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. కొన్ని వస్తువులను పోగేసుకున్నాడు కూడా. అయితే అప్పటికే ఆకలిగా ఉండటంతో ఏదైనా తినాలనుకున్నాడు.
ఇంట్లో ఎవరూ లేరు కదా.. ఇక మనల్ని ఎవరేం చేస్తారు అనే ధైర్యమో ఏమో కానీ వంటిట్లోకి దూరిపోయి కిచిడీ వండటం ప్రారంభించాడు. అయితే వంటిట్లో నుంచి శబ్దాలు రావడాన్ని గమనించిన పక్కింటివారు.. గుమ్మం వద్దకు వెళ్లి చూశారు. తాళం పగలగొట్టినట్లు ఉండటాన్ని గుర్తించి.. నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లి ఆ దొంగను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు.
కాగా ఈ ఘటనపై అస్సాం పోలీసులు ట్విటర్ వేదికగా సరదా వ్యాఖ్యలు చేశారు. ‘ఆహార చోరుడి ఆసక్తికర కేసు’గా దీన్ని అభివర్ణించారు. ‘కిచిడీ ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దొంగతనానికి వెళ్లినప్పుడు దాన్ని వండటం మీ శ్రేయస్సుకు హాని కలిగించవచ్చు’ అని చమత్కరించారు. ‘అరెస్టు చేసిన గువాహటి పోలీసులు ఆ దొంగకు వేడివేడి భోజనం వడ్డిస్తుండొచ్చు’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.