burglary: భలే దొంగ.. చోరీ కోసమే 5 కిలోల బరువు తగ్గాడు!
బరువు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆరోగ్యం కోసం కొందరు.. అందం కోసం కొందరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి కేవలం తన పాత యజమాని ఇంట్లో దొంగతనం చేయడం కోసమే 5 కిలోల బరువు తగ్గాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. అతడు దొంగతనం
అహ్మదాబాద్: బరువు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆరోగ్యం కోసం కొందరు.. అందం కోసం కొందరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి కేవలం తన పాత యజమాని ఇంట్లో దొంగతనం చేయడం కోసమే 5 కిలోల బరువు తగ్గాడు. పక్కా ప్రణాళికతో రూ.లక్షలు చోరీచేసి పరారైనా.. చివరికి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని ఉదయ్పుర్కి చెందిన మోతీ సింగ్ చౌహన్.. గుజరాత్లోని అహ్మదాబాద్లో మోహిత్ మరాడియా అనే వ్యక్తి ఇంట్లో సహాయకుడిగా పని చేసి.. మూడేళ్ల కిందట మానేశాడు. అయితే, మోహిత్ ఇంట్లో భారీగా నగదు, నగలు ఉండటం గమనించిన మోతీ సింగ్ ఎలాగైనా ఆ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పని చేస్తున్న సమయంలోనే ఇంట, బయట సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? ఏ చోట నుంచి ఇంట్లోకి చొరబడే అవకాశాలున్నాయనే విషయాలను గమనించాడు. చివరికి ఓ గాజు కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తే.. సీసీకెమెరాలో కనిపించదని తెలుసుకున్నాడు. కానీ, అతడు కాస్త లావుగా ఉండటంతో ఆ సన్నటి కిటికీ గుండా వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎలాగైనా ఆ కిటికీలో నుంచి దూరి దొంగతనం చేయాలని భావించిన మోతీ.. మూడు నెలలపాటు రోజుకు ఒక్కపూటే ఆహారం తింటూ 5 కిలోల బరువు తగ్గాడు. ఆ తర్వాత తన పాత యజమాని ఇంట్లో లేని సమయం చూసి చోరీకి పాల్పడ్డాడు. మొత్తం రూ.13.14లక్షలు విలువ చేసే నగదు, నగలు ఎత్తుకెళ్లాడు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మోతీ సింగ్ను గాలించడం మొదలుపెట్టారు. అయితే, గాజు కిటికీని పగలగొట్టానికి ఉపయోగించిన పరికరాన్ని మోతీ సింగ్ ఘటనాస్థలిలోనే వదిలేయడంతో దాని ఆధారంగా చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ పరికరం కొనుగోలు చేసిన దుకాణంలో మోతీ సింగ్ వివరాలు లభించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కేవలం దొంగతనం చేయడం కోసమే నిందితుడు మూడు నెలలపాటు కఠిన ఆహార నియమాలు పాటించి 5 కిలోల బరువు తగ్గాడని పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు