1700 కరోనా టీకా డోసులు చోరీ

ఓవైపు పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ల కొరత ఎదురవుతున్న వేళ.. హరియాణాలో కొందరు దుండగులు వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లడం కలకలం సృష్టించింది. జింద్‌ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 1,710

Published : 23 Apr 2021 01:04 IST

హరియాణాలో ఘటన

ఛండీగఢ్‌: ఓవైపు పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ల కొరత ఎదురవుతున్న వేళ.. హరియాణాలో కొందరు దుండగులు వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లడం కలకలం సృష్టించింది. జింద్‌ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 1,710 కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా డోసుల్ని దుండగులు చోరీ చేశారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో టీకా డోసులు లేని పరిస్థితి ఏర్పడింది.

జాతీయ మీడియా కథనాలు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పీపీ సెంటర్‌ జనరల్‌ ఆస్పత్రిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కరోనా టీకాల దొంగతనానికి పాల్పడ్డారు. మొత్తం 1,710 టీకా డోసుల్ని ఎత్తుకెళ్లారు. ఆస్పత్రిలో ఇతర మందులు, నగదు ఉన్నప్పటికీ దుండగులు వాటిని కనీసం ముట్టుకోలేదు. కేవలం కరోనా వైరస్‌ టీకాలే లక్ష్యంగా చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో సంబంధిత ఆస్పత్రి వర్గాలు వ్యాక్సిన్‌ నిల్వ చేసే ప్రదేశంలో సీసీ కెమెరాలు గానీ, లేదా గార్డుని గానీ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని