Crime: దొంగలు పడ్డారు..అయితే డబ్బుకోసం కాదు..
సాధారణంగా దొంగలు పడి డబ్బు, నగలు దోచుకెళ్తారు. కానీ, ముంబయిలో విచిత్ర ఘటన జరిగింది. ఓ హోటల్లో దొంగలు పడి కొన్ఇన వందల కిలోల బరువున్న భారీ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. అందుకోసం పెద్ద సొరంగం తవ్వడం గమనార్హం.
ముంబయి: సాధారణంగా దొంగలు పడి డబ్బు, నగలు దోచుకెళ్తారు. కానీ, ముంబయిలో విచిత్ర ఘటన జరిగింది. ఓ హోటల్లో దొంగలు పడి కొన్ని వందల కిలోల బరువున్న భారీ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. అందుకోసం పెద్ద సొరంగం తవ్వడం గమనార్హం.
అరే ప్రాంతంలోని ఇంపీరియల్ ప్యాలెస్ అనే హోటల్కు వెనుకవైపు నుంచి దొంగలు కొన్ని రోజులపాటు కష్టపడి సొరంగాన్ని తవ్వారు. అనంతరం హోటల్లోకి ప్రవేశించి.. అక్కడున్న పది అడుగుల భారీ సైనిక విగ్రహాన్ని చోరీ చేశారు. ఆ విగ్రహాన్ని ఇటలీలో తయారు చేశారట. దీని ధర దాదాపు.. రూ.7లక్షలు ఉంటుందని అంచనా. కొన్ని రోజుల కిందట.. హోటల్ సిబ్బంది ఆ విగ్రహం కనిపించట్లేదని అరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హోటల్ వెనుకవైపు ఉన్న అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టగా విగ్రహానికి సంబంధించిన 300కిలోలకుపైగా బరువున్న పలు భాగాలు లభించాయి. దర్యాప్తును ముమ్మరం చేయగా.. ఇది పావై పథాక్ అనే విగ్రహాల దొంగల గ్యాంగ్ చేసిన పనిగా గుర్తించారు. ఆ గ్యాంగ్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా విడదీసి అరే అటవీ ప్రాంతంలో దాచిపెట్టి.. కొన్నాళ్ల తర్వాత విక్రయించాలని దొంగలు భావించారట. అలా దొంగలు విగ్రహపు భాగాలను కుర్లాలో విక్రయించే ప్రయత్నం చేస్తుండగా.. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లాక్డౌన్లో హోటల్ మూతపడగా.. చిన్న చిన్న కాంస్య విగ్రహాలు, విలువైన వస్తువులు కూడా చోరీకి గురయ్యాయని హోటల్ యాజమాన్యం వెల్లడించింది. కానీ, ఈ సారి భారీ విగ్రహం చోరీకి గురికావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM