Crime news: నగలు చోరీ చేసి దొంగల బీభత్సం.. బైక్పై వెళ్తూ గాల్లోకి కాల్పులు!
రెండు రోజుల వ్యవధిలోనే దేశ రాజధాని నగరంలో మరో నగల దుకాణంలో చోరీ ఘటన కలకలం రేపుతోంది. నగలు చోరీ చేసిన ముగ్గురు దొంగలు బైక్పై వెళ్తూ గాల్లోకి కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నగరంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. సమయ్పూర్ బద్లీ అనే ప్రాంతంలోని ఓ నగల దుకాణంలోకి చొరబడిన ముగ్గురు దొంగలు సిబ్బందికి తుపాకీ గురిపెట్టి చోరీకి పాల్పడ్డారు. అనంతరం తప్పించుకొనే ప్రయత్నంలో బైక్పై వెళ్తూ గాల్లోకి కాల్పులు జరిపి బీభత్సం సృష్టించడం తీవ్ర కలకలం రేపింది. హెల్మెట్లు ధరించి చొరబడిన దుండగులు శ్రీరామ్ జ్యువెలరీ దుకాణంలో దాదాపు 500 గ్రాములతో పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు దొంగలు ఆయుధాలతో చొరబడ్డారని, సిబ్బందికి తుపాకీ గురిపెట్టి ప్రదర్శనకు ఉంచిన ఆభరణాలన్నింటినీ దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. వీటి విలువను యజమానులు మదింపు చేస్తున్నారన్నారు. వీటి విలువ దాదాపు రూ.30లక్షలు ఉంటుందని అంచనా.
చిన్నతల్లికి ఎంత కష్టం.. అత్యాచారానికి గురై వీధిలో రక్తమోడుతూ సాయం కోరితే..!
అయితే, ఈ మధ్యాహ్నం 2గంటల సమయంలో తమకు ఫోన్ రాగా.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించినట్టు చెప్పారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ముగ్గురు దుండగులు బైక్పై వెళ్తూ గాల్లోకి కాల్పులు జరిపిన దృశ్యాలను గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ దిల్లీలోని భోగాల్ ప్రాంతంలో ఉమ్రావ్ జ్యువెలరీ దుకాణంలో ₹20 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ ఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే తాజా ఘటన చోటుచేసుకోవడం కలవరపెడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప ఫేమ్ జగదీశ్ అరెస్ట్
యువతిని బెదిరించి ఆమె ఆత్మహత్యకు కారకుడైన సినీ నటుడు బండారు ప్రతాప్ అలియాస్ జగదీశ్(31)ను బుధవారం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. -
అత్తమామల చేతిలో శివాని బలి.. చితిలో కాలిన శవంతో ఠాణాకు!
చితిలో కాలిపోతున్న కుమార్తె మృతదేహాన్ని బయటకు తీసిన తల్లిదండ్రులు.. దాన్ని అలాగే తీసుకొని పోలీస్స్టేషనుకు వెళ్లారు. -
13 వేల బాతు పిల్లల మృత్యువాత.. నష్టాన్ని తట్టుకోలేక..
మిగ్జాం తుపాను కారణంగా రూ.15 లక్షల విలువ చేసే బాతు పిల్లలు మృతి చెందగా.. నష్టాన్ని తట్టుకోలేక వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందడం విషాదం నింపింది. -
సుఖ్దేవ్సింగ్ హత్యకేసు నిందితుల్లో సైనికుడు!
రాష్ట్రీయ రాజ్పూత్ కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్సింగ్ గోగామేడీ హత్య రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. జైపుర్లో జరిగిన ఈ హత్యను నిరసిస్తూ కర్ణిసేన బుధవారం రాజస్థాన్ బంద్ నిర్వహించింది. -
భార్యాబిడ్డలను చంపి రైల్వే వైద్యుడి ఆత్మహత్య!
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీకి చెందిన ఓ వైద్యుడు తన భార్యాపిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. -
మహదేవ్ యాప్ నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి
ఛత్తీస్గఢ్లో ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో కీలక నిందితుడు అసిమ్దాస్ తండ్రి సుశీల్దాస్(62) అనుమానాస్పద స్థితిలో మరణించారు. -
పోలీసులు కొట్టారని..పెట్రోల్ పోసుకున్నాడు
సంబంధం లేని గొడవలో తనను తీసుకెళ్లి పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు పోలీస్స్టేషన్లోనే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సాయంత్రం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. -
పింఛను సొమ్ముతో వాలంటీరు పరారీ
పింఛను సొమ్ముతో గ్రామ వాలంటీరు పరారైన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. -
అపహరించి.. డబ్బులు డిమాండ్ చేసి
డబ్బుల కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసును అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పోలీసులు 2 రోజుల్లో ఛేదించారు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం