Vande Bharat: పట్టాలపై మద్యం తాగి.. ‘వందే భారత్’పై దాడి కేసులో ముగ్గురి అరెస్టు
విశాఖ నగరంలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి నగరానికి వచ్చిన ఈ రైలుపై కంచరపాలెం ప్రాంతంలో కొందరు రాళ్లు విసరడంతో బోగీల అద్దాలు పగిలాయి.
విశాఖపట్నం, న్యూస్టుడే: విశాఖ నగరంలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి నగరానికి వచ్చిన ఈ రైలుపై కంచరపాలెం ప్రాంతంలో కొందరు రాళ్లు విసరడంతో బోగీల అద్దాలు పగిలాయి. ఈ కేసును పోలీసులు, రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, రైల్వే, ఆర్పీఎఫ్ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. డీసీపీ-2 ఆనందరెడ్డి కంచరపాలెం పోలీసు స్టేషన్కు వచ్చి విచారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మదీనాబాగ్కు చెందిన గోశాల శంకర్ (22), తన స్నేహితులు చందు (21), పి.రాజ్కుమార్ (19)లతో కలిసి అండర్ బ్రిడ్జి వద్ద మద్యం తాగుతూ కూర్చున్నాడు. అదే సమయంలో వందేభారత్ రైలు రావడంతో దానిపైకి రాళ్లు రువ్వారు. దూరం నుంచి అది చూసి ఆర్పీఎఫ్ సిబ్బంది వెంబడించగా పరుగు తీశారు. సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. గోశాల శంకర్పై సస్పెక్ట్ షీట్, 4 ఆస్తి సంబంధిత నేరాల కేసులున్నాయి. మదీనాబాగ్కు చెందిన టి.చందుపై గతంలో జీఆర్పీ స్టేషన్లో ఓ కేసుంది. మరో నిందితుడు రాజ్కుమార్ (19)ను కూడా అరెస్టు చేసి రైల్వే కోర్టులో హాజరుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం