TS 10th Exam: వాట్సప్లో హిందీ ప్రశ్నపత్రం.. ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు
రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ముగ్గురు నిందితులకు మంగళవారం హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కస్టడీ, బెయిల్ దరఖాస్తులపై మంగళవారం హనుమకొండ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరింత విచారణ నిమిత్తం ప్రధాన నిందితుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్తో పాటు ఏ2, ఏ3 భూర ప్రశాంత్, గుండెబోయిన మహేశ్ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఈ నెల 6న న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, బండి సంజయ్ తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆరెస్టయిన ఐదో తేదీన దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బండి సంజయ్కి బెయిల్ మంజూరై విడుదల కావటంతో, ఆయన కస్టడీ పిటిషన్ నిష్ప్రయోజనమైంది.
దీంతో పోలీసులు ఐదో నిందితుడు ఎం.శివగణేశ్ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ సోమవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు కస్టడీ పిటిషన్లపై హనుమకొండ జిల్లా నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థాన ఇన్ఛార్జి న్యాయమూర్తి, రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ షేక్ అరీఫ్ సోమవారం వాదనలు విన్నారు. అలాగే ఇదే ముగ్గురు (ప్రశాంత్, మహేశ్, శివగణేశ్) నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తులపైనా వాదనలు విన్నారు. ఏ2 ప్రశాంత్, ఏ3 మహేశ్, ఏ5 శివగణేష్కు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు కస్టడీ పిటిషన్ను న్యాయమూర్తి డిస్మిస్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు