Road Accident: మరో కొన్ని క్షణాల్లో గమ్యస్థానం.. అంతలోనే విషాదం

మరికొద్ది క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనే లోపే మృత్యువు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.

Updated : 10 Aug 2022 16:07 IST

నల్లమాడ(అనంతపురం): మరికొద్ది క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనే లోపే మృత్యువు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. చిన్నారి పుట్టెంటికలు తీయించుకుని వస్తుండగా.. ఓ కుటుంబం రోడ్డు ప్రమాదం బారిన పడిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున దంపతులు.. 11 నెలల కుమార్తె పుట్టెంటికలు తీయించేందుకు కుటుంబసభ్యులతో కలిసి మినీ బస్సులో శుక్రవారం తిరుపతి వెళ్లారు. ఆ వేడుక ముగిసిన అనంతరం రాత్రి తిరుగుపయనమయ్యారు. కదిరి- హిందూపురం ప్రధాన రహదారిపై వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చలపతి (45), బోగాదమ్మ (40), ఈశ్వరయ్య (18) అక్కడికక్కడే మృతి చెందగా మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి విధులు ముగించుకుని అటుగా వెళ్తోన్న ఎస్సై గోపీ ప్రమాదాన్ని గుర్తించి.. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాడు. మరికొద్ది నిమిషాల్లో సొంతూరికి చేరుకోవాల్సిన తమ వాళ్లు అనుకోని ప్రమాదానికి గురి కావడంతో క్షతగాత్రుల బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు