Road Accident: మరో కొన్ని క్షణాల్లో గమ్యస్థానం.. అంతలోనే విషాదం
మరికొద్ది క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనే లోపే మృత్యువు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.
నల్లమాడ(అనంతపురం): మరికొద్ది క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనే లోపే మృత్యువు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. చిన్నారి పుట్టెంటికలు తీయించుకుని వస్తుండగా.. ఓ కుటుంబం రోడ్డు ప్రమాదం బారిన పడిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున దంపతులు.. 11 నెలల కుమార్తె పుట్టెంటికలు తీయించేందుకు కుటుంబసభ్యులతో కలిసి మినీ బస్సులో శుక్రవారం తిరుపతి వెళ్లారు. ఆ వేడుక ముగిసిన అనంతరం రాత్రి తిరుగుపయనమయ్యారు. కదిరి- హిందూపురం ప్రధాన రహదారిపై వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చలపతి (45), బోగాదమ్మ (40), ఈశ్వరయ్య (18) అక్కడికక్కడే మృతి చెందగా మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి విధులు ముగించుకుని అటుగా వెళ్తోన్న ఎస్సై గోపీ ప్రమాదాన్ని గుర్తించి.. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాడు. మరికొద్ది నిమిషాల్లో సొంతూరికి చేరుకోవాల్సిన తమ వాళ్లు అనుకోని ప్రమాదానికి గురి కావడంతో క్షతగాత్రుల బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!