TS News: సెల్ఫీ సరదాకు ముగ్గురు బాలికల బలి

నిర్మల్‌ జిల్లా తానూర్‌ మండలం సింగన్‌గావ్‌లో విషాదం చోటుచేసుకుంది.

Updated : 05 Jul 2021 11:43 IST

తానూర్‌: సెల్ఫీ సరదా ముగ్గురు బాలికలను బలిగొన్న ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. తానూర్‌ మండలం సింగన్‌గావ్‌లో చెరువులో పడి అక్కాచెల్లెళ్లు అస్మిత(15), వైశాలి(13) వారి బంధువుల అమ్మాయి అంజలి(15) మృతిచెందారు. ముథోల్‌ సీఐ అజయ్‌ బాబు తెలిపిన వివరాల మేరకు.. ఈ ముగ్గురు బాలికలు ఆదివారం మధ్యాహ్నం చేనుకు వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైశాలి, అస్మిత వాళ్ల తల్లి మంగళబాయి ముగ్గురినీ ఇంటికి వెళ్లిపోవాలని చెప్పింది. ఇంటికి వెళ్లే క్రమంలో ముగ్గురు బాలికలు స్థానికంగా ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి గట్టు మీద సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని