AP News: రూ. కోటిన్నర అప్పు చేసిన అన్న.. తమ్ముడు, తల్లిదండ్రులు బలవన్మరణం 

అప్పుల బాధతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాలెం గ్రామంలో చోటు చేసుకుంది..

Updated : 26 Aug 2021 12:59 IST

పుత్తూరు: అప్పుల బాధతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శంకరయ్య(55), గురువమ్మ(50) దంపతుల పెద్దకుమారుడు సతీష్‌  తనకు పరిచయం ఉన్న వ్యక్తుల వద్ద రూ.కోటిన్నరకు పైగా అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటికి వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వమని అడగటంతో సతీష్‌ ఇంటి నుంచి పారిపోయాడు.

దీంతో మనస్తాపానికి గురైన శంకరయ్య, గురవమ్మ.. వాళ్ల చిన్న కుమారుడు వినయ్‌(25) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని