Crime News: గ్లాస్ బాటిల్లో టపాసులు కాలుస్తుంటే అడ్డుకున్న వ్యక్తి.. కత్తితో పొడిచి చంపిన మైనర్లు
గ్లాసు బాటిల్లో టపాసులు కాల్చడాన్ని అడ్డుకున్నందుకు ముంబయిలో ఓ వ్యక్తిని ముగ్గురు మైనర్లు హత్య చేశారు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఇంకో బాలుడు పరారీలో ఉన్నాడు.
ముంబయి: గ్లాసు బాటిల్లో టపాసులు కాల్చడాన్ని అడ్డుకోవడమే అతడి పాలిట మృత్యుపాశమైంది. గ్లాసు పేలి గాజు ముక్కలు ఎవరికి గుచ్చకుంటాయో అన్న ఆలోచనే అతడిని విగతజీవిని చేసింది. దీపావళి వేడుకలు అందరి ఇంట్లో సంతోషాలను నింపితే ఆ వ్యక్తి కుటంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టపాసులు కాలుస్తూ, బాణసంచా వెలుగుల్లో ప్రజలు ఆనందపరవశులు అయ్యారు. అయితే ఈ వేడుకల్లో జరిగిన ఓ చిన్నవివాదం వ్యక్తి ప్రాణాలను తీసింది. టపాసులు కాల్చడాన్ని అడ్డుకున్నందుకు ముగ్గురు మైనర్లు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటన ముంబయిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని 21 ఏళ్ల సునీల్ శంకర్ నాయుడిగా గుర్తించారు.
ముంబయిలోని శివాజీ నగర్లో 12 ఏళ్ల బాలుడు గ్లాసు బాటిల్లో టపాసులు ఉంచి పేలుస్తున్నాడు. తన ఇంటి సమీపంలో కాలుస్తుండడంతో గమనించిన సునీల్ నాయుడు అక్కడికి వచ్చి ఆ బాలుడికి అడ్డుచెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ గమనించి బాలుడి అన్న(15 ఏళ్లు), అతని స్నేహితుడు(14)తో అక్కడికి చేరుకొని ముగ్గురు కలిసి బాధితుడిని కొట్టారు. ఈ క్రమంలో బాలుడి అన్న కత్తితో ఆ వ్యక్తిని పొడిచాడు. తీవ్రగాయాలు కావడంతో బాధితుడిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీల్ నాయుడు మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. వ్యక్తి మృతికి కారణమైన బాలుడి అన్న, అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు. మరో బాలుడి కోసం గాలింపు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!