Crime News: ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం.. ముగ్గురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

రంగారెడ్డి జిల్లాలోని ఔటర్‌రింగ్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్‌ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఆగి ఉన్న లారీని కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో

Published : 04 Jul 2022 19:27 IST

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లాలోని ఔటర్‌రింగ్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్‌ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఆగి ఉన్న లారీని కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో చిక్కుకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతులను మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది.. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన శంషాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులు హయత్‌నగర్‌ నుంచి శంషాబాద్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు