Madhya Pradesh: దారుణం.. మహిళకు నిప్పంటించి, వీడియోలు తీసి..!
మధ్యప్రదేశ్లో ఇరువర్గాల మధ్య భూవివాదం అమానవీయ ఘటనకు దారితీసింది. పొలంలో ఉన్న ఓ మహిళకు ముగ్గురు వ్యక్తులు నిప్పటించి, ఆ ఘటనను వీడియో తీసి అత్యంత దారుణానికి పాల్పడ్డారు.
భోపాల్: మధ్యప్రదేశ్లో ఇరువర్గాల మధ్య భూవివాదం అమానవీయ ఘటనకు దారితీసింది. పొలంలో ఉన్న ఓ మహిళకు ముగ్గురు వ్యక్తులు నిప్పటించి, ఆ ఘటనను వీడియో తీసి అత్యంత దారుణానికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారని బాధితురాలి భర్త పోలీసులకు వెల్లడించారు. ప్రస్తుతం ఆ మహిళ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుణ జిల్లాకు చెందిన బాధితురాలి పేరు రాంప్యారీ సహరియా. సంక్షేమ పథకంలో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఆమె కుటుంబానికి కొంత భూమి కేటాయించింది. ఆ భూమిని ముగ్గురు వ్యక్తులు ఆక్రమించగా.. ఇటీవలే రెవెన్యూ విభాగం దానిని విడిపించి, సహరియా కుటుంబానికి ఇప్పించింది. ఈ క్రమంలో బాధితురాలిపై దాడి జరిగింది. ఆమె భర్త అర్జున్ పొలం వద్దకు వెళ్తుండగా.. ఆ నిందితులు ట్రాక్టర్పై వెళ్లిపోవడాన్ని గమనించాడు. అనుమానం వచ్చి తన పొలం వైపు చూడగా.. పొగలు రావడం కనిపించింది. దగ్గరకు వెళ్లగా అతడి భార్య మంటల్లో కాలి, తీవ్రంగా గాయపడి ఉండటాన్ని గమనించాడు. నిప్పంటించి, వీడియోలు తీసిన విషయాన్ని తన భార్య చెప్పినట్లు అర్జున్ పోలీసులకు తెలిపాడు. అతడి ఫిర్యాదు మేరకు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా.. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కాగా, ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపాపై విపక్షాలు మండిపడుతున్నాయి. ‘రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళను నిలబెట్టిన పార్టీ ఒక గిరిజన మహిళపై ఈ స్థాయి దారుణానికి అనుమతించింది. ఇది సిగ్గుచేటు చర్య’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్