రుణం ఇప్పిస్తామని రూ.20 లక్షలు టోకరా
రూ.90 కోట్ల రుణం ఇప్పిస్తామంటూ కేటుగాళ్లు ఓ వ్యాపారి దగ్గర రూ.20 లక్షలు కాజేశారు. ఎర్రమంజిల్లో నివాసముంటున్న నాగేశ్వరరావు..
హైదరాబాద్: రూ.90 కోట్ల రుణం ఇప్పిస్తామంటూ కేటుగాళ్లు ఓ వ్యాపారి దగ్గర రూ.20 లక్షలు కాజేశారు. ఎర్రమంజిల్లో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పేపర్ కంపెనీని నడుపుతున్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో రుణం కోసం ప్రయత్నించారు. మాదాపూర్కు చెందిన సవేర ఏజెన్సీస్ నిర్వాహకులు నాగరాజు, లీలాకాంత్, చింతేశ్వరావు రూ. 20 లక్షలు కడితే రూ.90 లక్షల లోన్ ఇప్పిస్తామంటూ నాగేశ్వరరావుకు తెలిపారు. దీంతో నాగేశ్వరరావు వారికి రూ. 20 లక్షలు ముట్టజెప్పారు. అయితే నిందితులు రుణం మంజూరు అయినట్లు గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీస్ నుంచి నకిలీ మంజూరీ పత్రాన్ని నాగేశ్వరరావుకి ఇచ్చారు. రుణం విడుదల కావడంలో జాప్యం జరుగుతుండడంతో మోసపోయానని గ్రహించిన నాగేశ్వరరావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి..
దా‘రుణ’ యాప్లు: 90శాతం వారివే!
బాలికపై గ్యాంగ్ రేప్.. సజీవ దహనం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.