Hyderabad: శంషాబాద్‌ సమీపంలో ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పెద్ద షాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని డీసీఎం వ్యాను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Published : 04 Dec 2022 19:39 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పెద్ద షాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని డీసీఎం వ్యాను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ మండలం కడియాల కుంటతండాకు చెందిన గోపాల్‌ నాయక్‌(47), అంజలి(42), స్వాతి(9) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. పెద్ద షాపూర్‌ సమీపంలోకి రాగానే వెనుకనుంచి అతి వేగంగా వచ్చి డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని