Andhra News: గుండ్లకమ్మ వాగులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి
గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు వద్ద గుండ్లకమ్మ వాగులో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. శుభకార్యానికి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు
వినుకొండ: గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు వద్ద గుండ్లకమ్మ వాగులో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. శుభకార్యానికి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు గుండ్లకమ్మవాగులో సరదాగా ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ నీట మునిగి విజయవాడకు చెందిన ఆయేషా సిద్ధిక్వా(19), వినుకొండకు చెందిన ఎస్కే హీనా(22), నరసరావుపేటకు చెందిన ఎండీ ఫీజుల్లా ఖాన్ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ముగ్గురి మృత దేహాలను వెలికితీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.