Bapatla: బాపట్ల తీరంలో విషాదం.. నలుగురు విద్యార్థుల గల్లంతు

బాపట్లలోని సూర్యలంక సముద్రతీరంలో విషాదం చోటుచేసుకుంది. తీరంలో స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.

Updated : 04 Oct 2022 17:03 IST

సూర్యలంక: బాపట్లలోని సూర్యలంక సముద్రతీరంలో విషాదం చోటుచేసుకుంది. తీరంలో స్నానానికి వెళ్లిన ఏడుగురు విద్యార్థుల్లో నలుగురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. వీరంతా విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన సిద్ధు, అభి, సాయి మధుగా గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని