Andhra News: తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం

తిరుమల ఆలయంలో కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. తిరుమల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో చిన్నారి క్షేమంగా ఉన్నాడు.

Updated : 05 May 2022 15:03 IST

తిరుపతి: తిరుమల ఆలయంలో కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. తిరుమల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో చిన్నారి క్షేమంగా ఉన్నాడు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నెల 3న తిరుమల అఖిలాండం వద్ద బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. అనంతరం కిడ్నాపర్‌ పవిత్ర బాలుడిని తీసుకొని మైసూర్‌ వెళ్లింది. అక్కడ ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు బాలుడిని తీసుకెళ్లింది.

చిన్నారిని ఎందుకు తీసుకొచ్చావని పవిత్ర తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించారు. అనంతరం తిరుమలకు వచ్చి బాలుడిని తితిదే విజిలెన్స్‌కు పోలీసులకు వారు అప్పగించారు. మతిస్థిమితం లేక బాలుడిని తమ కూతురు తీసుకొచ్చిందని పోలీసులకు కిడ్నాపర్‌ పవిత్ర తల్లిదండ్రులు చెప్పారు. అనంతరం బాలుడిని తల్లికి అప్పగించారు. తన వద్దకు బాలుడు తిరిగి చేరడంతో ఆ తల్లి ఆనందంతో ఉప్పొంగిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని