Vizag: కాగిత టోల్‌ప్లాజా సిబ్బందిపై వైకాపా నాయకుల దాడి..వీడియో వైరల్‌

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌ ప్లాజ్‌ వద్ద ఫీజు చెల్లించే విషయమై ప్లాజా సిబ్బందిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. పాయకరావు పేటకు చెందిన నాయకులు కారులో గేటు వద్దకు రాగా.. ఫీజు చెల్లించాలని అక్కడి సిబ్బంది కోరారు. దీనికి నిరాకరించిన నేతలు తాము ప్రజా ప్రతినిధులమంటూ వాగ్వాదానికి దిగారు. సహనం కోల్పోయిన నాయకులు కారులోంచి దిగి సిబ్బందిపై....

Published : 06 Nov 2021 01:52 IST

నక్కపల్లి: విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌ ప్లాజ్‌ వద్ద సిబ్బందిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. పాయకరావు పేటకు చెందిన నాయకులు కారులో టోల్‌ గేటు వద్దకు రాగా.. ఫీజు చెల్లించాలని అక్కడి సిబ్బంది కోరారు. దీనికి నిరాకరించిన నేతలు తాము ప్రజా ప్రతినిధులమంటూ వాగ్వాదానికి దిగారు. సహనం కోల్పోయిన నాయకులు కారులోంచి దిగి సిబ్బందిపై దాడి చేశారు. ఈ క్రమంలో సిబ్బందిలో ఒకరి తల, కాలికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఇంతలో బాధితుడి తరఫు బంధువులు, గ్రామస్థులు ఆస్పత్రికి చేరుకోగా ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపేశారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి దృశ్యాలు ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని