Gold: శంషాబాద్‌లో భారీ మొత్తంలో బంగారం స్వాధీనం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 15 May 2023 22:51 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ మొత్తంలో బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. మస్కట్‌ నుంచి వచ్చిన ప్రయాణికురాలి నుంచి దాదాపు కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ప్రయాణికులరాలి లగేజీ తనిఖీ చేసినట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. ఆదివారం కూడా దాదాపు 1.2 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. రియాద్‌ నుంచి ఎమర్జెన్సీ లైట్‌ బ్యాటరీలో బంగారాన్ని తీసుకురాగా.. అధికారులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని